ఓటు హక్కును వినియోగించుకోనున్న సీఎం జగన్‌..ఎప్పుడు, ఎక్కడంటే ?

-

రేపు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు సీఎం జగన్‌. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు కడపకు పయనం అవుతారు. విజయవాడ నుంచి సాయంత్రం నాలుగు గంటలకు పులివెందుల చేరుకోనున్న సీఎం జగన్‌…ఇవాళ రాత్రికి పులివెందులలోని తన స్వగృహంలో బస చేయనున్నారు. రేపు ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య పులివెందులలోని భాకరాపురంలో తన ఓటు హక్కు వినియోగించుకోనున్న సీఎం జగన్…అనంతరం 10 గంటలకు గన్నవరం బయలుదేరి వెళ్ళనున్నారు.

CM Jagan will exercise his right to vote

పోలింగ్ ప్రారంభం కాగానే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. పులివెందుల భాకరాపురంలోని జయమ్మ కాలనీలో అంగన్వాడి రెండో సెంటర్లో 138 బూత్ నెంబర్ లో తమ ఓటు హక్కును వినియోగించుకోనుంది ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ. అదే పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version