దుర్గగుడి అభివృద్ధి పనులకు వచ్చే నెల 7న సీఎం జగన్ శంకుస్థాపన

-

విజయవాడ దుర్గగుడి ఆలయ అభివృద్ధి పనుల శంకు స్థాపనకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. విజయవాడ దుర్గగుడి ఆలయ అభివృద్ధి పనులకు డిసెంబర్ 7న సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. రూ. 225 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇప్పటికే సిద్ధమైంది.

CM Jagan will lay the foundation stone for the development works of Durga Gudi on the 7th of next month
CM Jagan will lay the foundation stone for the development works of Durga Gudi on the 7th of next month

ఆటు డిసెంబర్ 8న శ్రీశైలంలో రూ. 125 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులను సీఎం ప్రారంభిస్తారు. ఇక 60 కోట్లతో సింహాచల క్షేత్రం, రూ. 80 కోట్లతో అన్నవరం క్షేత్రం, రూ. 70 కోట్లతో ద్వారకాతిరుమల అభివృద్ధికి అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కాగా ఇటీవలే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న సంగతి తెలిసిందే. దసరా ఉత్సవాల్లో భాగంగా పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news