BREAKING : సెప్టెంబర్ లో విశాఖకు రానున్న సీఎం జగన్‌ కుటుంబం

-

సెప్టెంబర్ లో విశాఖకు రానున్నారు సీఎం జగన్‌. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అనంతరం పవన్ కళ్యాణ్ పై వైవీ సుబ్బారెడ్డి ఫైర్‌ అయ్యారు. పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నాడని… వాలంటీర్ల పై కామెంట్ చేయడం వల్ల వాళ్ళ మానసికంగా బాధపడ్డారని వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌ ఎవరో రాసిన స్క్రిప్ట్ చదువుతున్నాడని ఆగ్రహించారు.

వాలంటీర్లపై అసత్య ప్రచారం చేస్తే ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు వైవీ సుబ్బారెడ్డి. సీఎం జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ లో విశాఖ రానున్నారని.. తెలిపారు. వైసీపీ పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి. కోలా గురువులుకు విశాఖ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం, బీసిలకి లభించిన గౌరవం అన్నారు వైవీ సుబ్బారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news