ఇళ్లు లేని పేదలకు సీఎం జగన్ అదిరిపోయే శుభవార్త

-

ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా 1,10,672 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారులు వెల్లడించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ పై సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షకు మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వచ్చే మార్చి కల్లా మరో 1,10,968 ఇళ్లను అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వివరించారు. టిడ్కో ఇళ్లలో ఇప్పటికే 40,576 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించామని, మార్చి లోపు మిగిలిన ఇళ్లను పంపిణీ చేస్తామన్నారు. పేజ్-1 కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా దాదాపుగా ముగిసిందని సీఎంకు వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version