ఒక్కో ఎమ్మెల్యేకు బీజేపీ రూ.100 కోట్లు ఆఫర్ : బాల్క సుమన్‌

-

బీజేపీ కుతంత్రాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బట్టబయలు చేశారని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ సమాజం అమ్ముడుపోయే రకం కాదని బీజేపీ గ్రహించాలని చెప్పారు. భారీగా నగదు, కాంట్రాక్టులు ఎరగా చూపి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ విఫల ప్రయత్నం చేసిందని ఆరోపించారు. మునుగోడులో ఓడిపోతామనే ఇలాంటి కుట్రకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. \

‘ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు, కాంట్రాక్టులు ఆఫర్‌ చేశారు. నలుగురు ఎమ్మెల్యేలను కొనాలని  బీజేపీ ప్రయత్నించింది. కానీ మా ఎమ్మెల్యేలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి ప్లాన్ ను బట్టబయలు చేశారు. తెలంగాణ సమాజం అమ్ముడు పోయేది కాదని బీజేపీ గ్రహించాలి. కేసీఆర్‌ నాయకత్వంలోనే తెలంగాణ బిడ్డలు నడుస్తారు. ‘-బాల్క సుమన్‌, టీఆర్ఎస్ ఎమ్మెల్యే

ఉద్యమకారులను ఎప్పటికీ కొనుగోలు చేయలేరని బాల్క సుమన్‌ అన్నారు. రాజగోపాల్‌రెడ్డిలా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎప్పుడూ చేయరని స్పష్టం చేశారు. బీజేపీ కుట్రలను మునుగోడు ప్రజలు గ్రహించాలని సూచించారు. ప్రలోభాలపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుతారని.. మోదీని గద్దె దింపుతారని దిల్లీ పెద్దలకు భయం పట్టుకుందని బాల్క సుమన్ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version