ఇవాళ సీఎం జగన్ గుంటూరు జిల్లా పర్యటన

-

ఇవాళ సీఎం జగన్ గుంటూరు జిల్లా పర్యటనకు బయలు దేరనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్‌. ఇవాళ ఉదయం పదిన్నరకు నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్ కు చేరుకోనున్న సీఎం జగన్ మోహన్‌ రెడ్డి…శాప్ జెండా, జాతీయ జెండా ఆవిష్కరణ చేయనున్నారు.

Andhra Pradesh Govt Announces regervations

అనంతరం సీఎం జగన్ ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్ ను లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం జగన్. క్రీడాకారులతో సీఎం జగన్ ఇంటరాక్షన్ చేయనున్నారు.

ఇక ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం జగన్. ఇక ఇవాళ్టి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు క్రీడా పోటీలు జరుగుతాయి. అంటే ఏపీలో 47 రోజుల పాటు క్రీడా సంబరం జరుగనుందన్న మాట. గ్రామ వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news