నేడు పులివెందుల, ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన

-

నేడు పులివెందుల, ఇడుపులపాయలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.1000 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్‌. సీఎం పర్యటన వివరాలు ఇలా…ఉన్నాయి. ఇవాళ ఉదయం 10.20 కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. -అక్కడి నుంచి 10.25కు హెలికాప్టర్లో బయలు దేరి 10.40 పులి వెందులలోని భాకరాపురం హెలిప్యాడ్ కు చేరుకుంటారు.

CM Jagan’s visit to Pulivendula and Idupulapaya today

10.45కు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలు దేరి 10.55కు డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ హాస్పి టల్ వద్దకు చేరుకుంటారు. 11.35 వరకు డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.11.35 రోడ్డు మార్గాన బయలు దేరి 11.45కు బనాన ఇంటి గ్రేటెడ్ ప్యాక్ హౌస్ వద్దకు చేరుకుం టారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ప్యాక్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడుపుతారు.

అనంతరం అక్కడి నుంచి బయలు దేరి 12.10డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరి యట్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుం టారు. 12.25 వరకు కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడు పుతారు. 2.15కు హెలిక్టాపర్లో బయలు దేరి 2.25కు ఇడుపులపాయ హెలిప్యాడ్కు చేరుకుంటారు. 2.30కి రోడ్డు మార్గాన బయలు దేరి 2.35కు వైఎస్ ఆర్ మెమోరియల్ పార్క్ వద్దకు చేరుకుంటారు. 2.55 వరకు పార్క్ ప్రారంభోత్సవంలో గడుపుతారు. 5.30 అక్కడి నుంచి రోడ్డు మార్గాన 5.50కి ముఖ్యమంత్రి అధికార నివాసానికి చేరుకుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version