BREAKING : ఇవాళ సీఎం జగన్ తిరుపతి పర్యటన

-

BREAKING : ఇవాళ సీఎం జగన్ తిరుపతి పర్యటనకు బయలు దేరనున్నారు. ఇందులో భాగంగానే… ఇవాళ సాయంత్రం 5.30 నిమిషాలకు శ్రీ సిటీ ఎమ్.డి. రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరుకానున్నారు సీఎం జగన్.

CM Jagan’s visit to Tirupati today

ఈ మేరకు మధ్యాహ్నం 3.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. తిరుపతి తాజ్‌ హోటల్‌లో శ్రీ సిటీ ఎండీ రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌ జరుగుతోంది. ఇక ఈ కార్యక్రమానికి హాజరు అయిన తర్వాత ఇవాళ రాత్రికి తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం జగన్.

ఇది ఇలా ఉండగా…ఇవాళ ఆరోగ్య శ్రీ కార్యక్రమంపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం జరుగనుంది. ఈ నెల 18 నుంచి ఆరోగ్య శ్రీ కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆరోగ్య శ్రీ కొత్త కార్డులు, ఆరో గ్య శ్రీ డ్రైవ్ పై చర్చించనున్నారు సీఎం జగన్‌. అనంతరం తిరపతికి పయనం అవుతున్నారు జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news