2029లో వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది – సీఎం రేవంత్ రెడ్డి

-

2029లో వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుందని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కడప పార్లమెంట్‌కు ఉప ఎన్నికలు వస్తే నేను ఊరూరా తిరిగి వైఎస్ షర్మిలను గెలిపిస్తానని కూడా వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.  తాజాగా మంగళగిరిలో దివంగత సీఎం వైఎస్సార్ జయంతి కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

cm revanth reddy ys sharmila

ఈ సందర్బంగా  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..  రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి రావాలనుకున్నారు. కానీ మణిపూర్ పర్యటనలో ఉన్నందున రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిని శాశ్వతంగా గుర్తు పెట్టుకున్నామంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దారు. ప్రతీ కుటుంబంలో బలమైన ముద్ర వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news