CM Jagan: ఇవాళ విశాఖలో 1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం

-

ఇవాళ విశాఖలో 1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. వర్చువల్ గా 1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు CM జగన్. ముడసర్లోవలో 100 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ GVMC నూతన భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తారు.

CM YS Jagan will visit Visakhapatnam today

98 కోట్లతో అభివృద్ధి చేసిన పాలిటెక్నిక్, ఐటీఐలను ప్రారంభించనున్నారు CM జగన్‌. రూ.10 కోట్లతో టర్టెల్ బీచ్, వెంకోజీ పాలెం నుంచి మారియట్ హోటల్ జంక్షన్ వరకు డబుల్ రోడ్ నిర్మాణం, కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి మధురవాడ ప్రాంతానికి నీటి సరఫరా ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి. అటు  ‘విజన్ విశాఖ’ కార్యక్రమం సదస్సులో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్. 2,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలతో ‘విజన్ విశాఖ’ సమావేశం జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news