ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు

-

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై మంగళగిరి నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రైతులు ఫిర్యాదు చేశారు. రాజధాని అమరావతి విషయంలో నమ్మించి మోసం చేసినందుకు ఎమ్మెల్యే పై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతి ఉంటుందంటూ ఆళ్ల చేసిన ప్రకటనలను రైతులు తమ ఫిర్యాదుకు జత చేశారు. ఇప్పుడు మాటతప్పి తమని మోసం చేసినందున ఎమ్మెల్యే పై కేసు పెట్టి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Ramakrishna reddy

ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు అనేక వాగ్దానాలు చేస్తూ ఉంటారు. కానీ గెలిచిన తర్వాత కొన్ని వాగ్దానాలు నెరవేర్చ లేరు.. ఈ విషయం అప్పుడు తెలిసినప్పటికీ ఎన్నికల ముందు అధిక సంఖ్యలో వాగ్ధానాలు చేస్తూ ఉంటారు. సరిగ్గా కృష్ణాజిల్లాలో రాజధాని చిచ్చు అలానే ఉంది. ఎన్నికలకు ముందు అమరావతి అభివృద్ధి చేస్తామని చెప్పిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారుచిచ్చు లో దహించుకు పోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version