AP : వచ్చే నెలలో ఆ ఉద్యోగులకు కంప్యూటర్ నైపుణ్య పరీక్ష

-

AP : వివిధ ప్రభుత్వ విభాగాల్లోనే ఉద్యోగులకు నవంబర్ 14, 15 తేదీల్లో కంప్యూటర్ ప్రొఫెషియన్స్ టెస్టును నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రేడ్-1,2 వీఆర్వోలు, గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులు, 2014 మే 12 తర్వాత పలు విభాగాల్లో కారుణ్య నియామకాల్లో చేరినవారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని నవంబర్ 7 నుంచి హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

ఇక అటు నవంబర్ నెలాఖరులోగా ఆ పోస్టులన్నీ భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు DME డా. నరసింహం. ప్రభుత్వ బోధనాస్పత్రులు, వైద్య కళాశాలలో పారామెడికల్, నాన్-క్లినికల్ సహాయ సిబ్బంది పోస్టులన్నీ నవంబర్ నెలఖరులోగా భర్తీ చేయాలని DME డా. నరసింహం ఉత్తర్వులు జారీచేశారు. పోస్టుల భర్తీకి DSC ద్వారా కంబైన్డ్ నోటిఫికేషన్ ఇవ్వాలని సూపరిండెంట్లు, ప్రిన్సిపాల్స్ కు సూచించారు. కొత్త కాలేజీలోని పోస్టులతో పాటు పాత బోధనాస్పత్రులు, కాలేజీల్లో ఉన్న 1800 ఖాళీలను DSC ద్వారా భర్తీ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news