నేడు టిడిపి ఆధ్వర్యంలో కళ్ళు తెరిపిద్దాం ఆందోళన

-

నేడు టిడిపి ఆధ్వర్యంలో కళ్ళు తెరిపిద్దాం ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ తరుణం లోనే రాజమండ్రిలో జరగనున్న ఆందోళనలో పాల్గొననున్నారు నారా భువనేశ్వరి. జగనాసుర చీకటి పాలనకు నిరసనగా కళ్లకు గంతలు కట్టుకుని.రాత్రి. 7 గంటల నుంచి ఐదు నిమిషాల పాటు నిరసన తెలుపనున్నారు టీడీపీ నేతలు.

వాకిళ్లు బాల్కనీలు వీధుల్లోకి వచ్చి చంద్రబాబుకి మద్దతుగా నిజం గెలవాలని గట్టిగా అరవాలని టిడిపి శ్రేణులకు అధిష్టానం పిలుపునిచ్చింది. ఇది ఇలా ఉండగా, టిడిపి అధినేత చంద్రబాబు కుడికంటికి కాటరాక్ట్ సర్జరీ చేయాలని వైద్యులు తాజాగా తేల్చారు. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో ఉన్న సంగతి తెలిసింది. ఈనెల 25న ప్రభుత్వ వైద్యులు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన కుడి కంటిలో శుక్లాం ఉందని, సర్జరీ చేయాలని పేర్కొంటూ ఓ నివేదికను జైలు అధికారులకు సమర్పించారు. ఈ ఏడాది జూన్ లో చంద్రబాబు ఎడమ కంటికి సర్జరీ జరగడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news