కాంగ్రెస్ ఏపీ పాలిట విలన్ : ఎంపీ విజయసాయిరెడ్డి

-

కాంగ్రెస్ ఏపీ పాలిట విలన్ అని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇవాళ రాజ్యసభ రాష్ట్రపతి ప్రసంగంలో వైసీపీ తరుపున చర్చలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపికి కోలుకోలేని నష్టం చేసింది అన్నారు. కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలనకు ఏపీ పెద్ద బాదిత రాష్ట్రం అన్నారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరు అని పేర్కొన్నారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో కచ్చితంగా చెప్పారు.

కానీ ఏపీ ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ గౌరవించలేదన్నారు. 2004లో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. పదేళ్ల తరువాత చిట్టచివరిలో అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించారు. ఎన్నికల నోటిఫికేషన్ పది రోజుల ముందు రాష్ట్రాన్ని విభజించారు. ఎన్నికల్లో లాభం పొందాలనే ఉద్దేశంతో ఇలా చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో ఓడించారని గుర్తు చేశారు. ఏపీపై కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించారు. 

Read more RELATED
Recommended to you

Latest news