మైలవరం నుంచే పోటీ చేస్తా : ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

-

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను మైలవరం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. ఇవాళ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయి అని తెలిపారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసేది త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు. ముఖ్యంగా మంత్రి జోగి రమేష్ వల్ల నేను ఎన్నో ఇబ్బందులు పడ్డానని తెలిపారు.జోగి రమేష్ వెన్ను పోట్లు పొడుస్తుంటే.. వైసీపీ నుంచి ఎలా పోటీ చేస్తాను అని వ్యాఖ్యానించారు.

MLA Vasantha Krishna Prasad 

ప్రధానంగా తాను  కొన్ని సంఘటనల వల్ల చాలా బాధపడ్డానని చెప్పారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. నియోజకవర్గంలో కొంత భాగానికి మాత్రమే ఎమ్మెల్యేగా ఉండాల్సి వచ్చిందన్నారు. మొన్నటి వరకు రాజకీయాలకు స్వస్తి పలికి వ్యాపారం చేయాలని అనుకున్నానని వెల్లడించారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. శ్రేయోభిలాషులు మాత్రం రాజకీయాల్లో కొనసాగాలని కోరుతున్నారు.. త్వరలోనే నా నిర్ణయం ప్రకటిస్తానన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.

Read more RELATED
Recommended to you

Latest news