తెలంగాణలో ఆరోజే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో..!

-

తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో పై దిశానిర్దేశం చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లి ఖార్జున ఖర్గే. తాజాగా ఏసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేత సమావేశం ముగిసింది. ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇవ్వకండని హితబోధన చేశారు ఖర్గే. విద్య, వైద్యం, గృహ నిర్మాణాలపై దృష్టి పెట్టాలని నేతలకు ఖర్గే సూచించారు. ముఖ్యంగా రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ఎదురైన అనుభవాలను టీ కాంగ్రెస్ నేతలతో పంచుకున్నారు ఖర్గే. 

ఈ సందర్భంగా భట్టి విక్రమార్గ మీడియాతో మాట్లాడుతూ..  ఆగస్టు 26న చేవెళ్లలో జరిగే బహిరంగ సభలో మల్లి ఖార్జున ఖర్గే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తారు. ఇప్పటికే రైతు, యూత్ డిక్లరేషన్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. చేవెళ్ల సభలో ఎస్సీ, ఎస్టీ, డిక్లరేషన్లను ప్రకటించనుంది. ఈనెల 29న వరంగల్ లో మైనార్టీ డిక్లరేషన్ ని పార్టీ విడుదల చేయనుంది. అదేవిధంగా సెప్టెంబర్ 17న ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనుంది కాంగ్రెస్. 

Read more RELATED
Recommended to you

Exit mobile version