షర్మిల కుమారుడి రిసెప్షన్ లో కాంగ్రెస్ అగ్రనేతలు

-

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కుమారుడు  రాజారెడ్డి, అట్లూరి ప్రియా పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిల కుమారుడి రిసెప్షన్ కి హాజరయ్యారు. వీరితో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. తరువాత ఆ ఇద్దరి నేతలతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చర్చించారు. టికెట్లు మధ్య కాంపిటేషన్, గెలుపు గుర్రాల పేర్లను సీఎం వివరించినట్టు సమాచారం. దీంతో పాటు నామినేటేడ్ పదవుల ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు నామినేటేడ్ పదవులు ఇవ్వాలా..? ఆ తరువాత ఇద్దమా..? అనే అంశం పై మల్లికార్జున ఖర్గే, కేసీ రేవంత్ రెడ్డిలు చర్చించుకున్నట్టు సమాచారం.

వైఎస్ షర్మిలకి కాబోయే కోడలు ప్రియా అట్లూరి ఎవరంటే… కమ్మ సామాజిక వర్గానికి చెందిన యువతి. ప్రియా అట్లూరి అమెరికాలో స్థిరపడ్డారు. యూఎస్ సిటిజెన్‌షిప్ కూడా ఉంది. వైఎస్ షర్మిలకి కాబోయే కోడలు ప్రియా అట్లూరి  ఎవరంటే… కమ్మ సామాజిక వర్గానికి చెందిన యువతి. ప్రియా అట్లూరి అమెరికాలో స్థిరపడ్డారు. యూఎస్ సిటిజెన్‌షిప్ కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news