ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రైలు ప్రమాద బాధితుల కోసం కంట్రోల్ రూము సెంటర్లు

-

ఒడిస్సాలో రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే.. రైలు ప్రమాద బాధితుల కోసం కంట్రోల్ రూము సెంటర్లు చేసింది జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ల లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు ఏపీ అధికారులు. బాధిత కుటుంబాలకు చెందిన వారు పాస్పోర్ట్ ఫోటోలతో గ్రామ వార్డు సచివాలయంలో, తహశీల్దార్ కార్యాలయంలో తక్షణం సంప్రదించవచ్చని స్పష్టం చేసింది జగన్‌ సర్కార్‌.

ఈ ప్రక్రియలో భాగంగా ఘటన లోని బాధితులను గుర్తించేందుకు ఫోటో లు పంపవలసినదిగా విజ్ఞప్తి చేసింది. మృతుల్లో పదుల సంఖ్యలో తెలుగు వారు వుండే అవకాశం వుందని చెబుతున్నారు ఏపీ అధికారులు. ఇక ఎన్టీఆర్ జిల్లా వారి సమాచార వివరాల కోసం 0866-2575833 ఫోన్ నంబర్ నందు సంప్రదించాలని జిల్లా కలెక్టర్ దిల్లిరావు ప్రకటన చేశారు. కృష్ణా జిల్లా వారి సమాచారం కోసం కంట్రోల్ రూం టోల్ ప్రి నెంబరు 08672 252572, 78934 29231 ఏర్పాటు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news