విజయవాడలో యువతిని తగలబెట్టిన వ్యక్తి కూడా మృతి

-

విజయవాడ హనుమాన్‌ పేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు పార్శిల్‌ కార్యాలయంలో యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు ఓ యువకుడు. ఘటనా స్థలంలోనే మంటల్లో యువతి సజీవ దహనమయ్యింది. ఆ మంటలు యువకుడికి అంటుకుని తీవ్రగాయాలయ్యాయి. అతను కూడా కొద్ది సేపటి క్రితం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత కొంతకాలంగా యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు యువకుడు.

ప్రేమను నిరాకరించిందనే కోపంతో పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. బాధితురాలు విజయవాడలోని ఓ ప్రైవేటు కోవిడ్‌ సెంటర్‌లో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. మృతురాలు కృష్ణ జిల్లా విస్సన్నపేట నివాసిగా గుర్తించగా, హత్య చేసిన యువకుడు నాగభూషణం రెడ్డిగూడెం నివాసిగా గుర్తించారు. వారం క్రితమే నాగ భూషణం మీద పోలీసులకు మృతురాలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇకపై వెంట పడను అని చెప్పటంతో ఫిర్యాదు వెనక్కి తీసుకుందట. ఈలోపే ఆమె మీద పెట్రోల్ పోసి నిప్పంటించి తానూ కాలి పోయి ఆసుపత్రిలో చనిపోయాడు సదరు వ్యక్తి.

Read more RELATED
Recommended to you

Latest news