ఏపీలో కొనసాగుతున్న కరోనా కలకలం…!

-

కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ లో తన ప్రభావాన్ని కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ గడిచిన 24 గంటలలో నమోదైన కరోనా కేసు వివరాలను హెల్త్ బులిటెన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ హెల్త్ బులెటిన్ ప్రకారం నిన్న 21,020 మందికి శాంపిల్స్ ను పరీక్షించగా అందులో 1576 మందికి పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. అలాగే ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన 42 మందికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కరోజే కేసుల సంఖ్య 1608 కు చేరుకుంది. దీనితో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 25,000 మార్కును దాటి 25422 కు చేరుకుంది.

carona ap
carona ap

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 981 మంది కరోనా నుండి కోలుకొని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీనితో రాష్ట్రంలో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య నేటి వరకు 13194 కు చేరుకుంది. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో 11936 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. అలాగే నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 15 మంది కరోనా బారినపడి మృతి చెందారు. దింతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా వైరస్ ద్వారా మరణించిన సంఖ్య 292 కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news