ఏపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కరోనా పాజిటివ్

-

ఏపీలో మరో ఎమ్మెల్యేకి కరోన సోకింది. ఏపీకి చెందిన తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే, వైసీపీ నేత చిర్ల జగ్గిరెడ్డికి కరోనా సోకింది. తాజాగా ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే కరోనా లక్షణాలు పెద్దగా లేకపోవడంతో ప్రస్తుతానికి చిర్ల జగ్గిరెడ్డి హోం ఐసోలేషన్ లోనే ఉన్నారని చెబుతున్నారు.

వైద్యుల సలహా మేరకు ఆయన మేడికేషన్ తీసుకుంటున్నారు. అలానే తనను కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని జగ్గిరెడ్డి సూచించారు. ఇక అలానే తనకు కరోనా లక్షణాలు చాలా స్వల్పంగా మాత్రమే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగ్గిరెడ్డి తెలిపారు. ఇక ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతూ పోతున్నాయి. టెస్ట్ లు భారీగా పెంచడంతో పాటు ప్రైవేటుగా కూడా టెస్ట్ లకి రేట్లు తగ్గించడంతో భారీగా కేసులు నమోదవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news