కర్నూలు జిల్లాలో బిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు..!

-

కరోనా పాజిటివ్​గా నిర్థరణ అయిన గర్భిణీ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లా రుద్రవరంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..కరోనా బారిన పడిన గర్భిణీ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లా రుద్రవరానికి చెందిన ఓ గర్భిణికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఆ గర్భిణికి పురిటి నొప్పులు రావటంతో 108 వాహనానికి సమాచారం అందించారు. నంద్యాల ఆసుపత్రికి తరలించే క్రమంలో మధ్యలోనే ఆమె ప్రసవించింది. ప్రస్తుతం ఆమె నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

Baby
Baby

గత వారంలో ఇదే విధంగా విశాఖపట్నం లోని కెజిహెచ్ ఆసుపత్రికి లో శ్రీకాకుళంకు చెందిన కమల అనే కరోనా బాధితురాలు తొమ్మిదో నెల గర్భం తో ఉన్న సమయంలోనే ఆస్పత్రిలో చేరారు. ప్రైమరీ కాంటాక్ట్ అవ్వడం వలన కరోనా వార్డు లో ఉంచి చికిత్స ఇచ్చారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డకు కరోనా మహమ్మారి సోకలేదని వైద్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news