ధరణితో కేసీఆర్ ఓటమి…ల్యాండ్‌ టైటిలింగ్‌ తో జగన్ ఓటమి – నారాయణ

-

సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ధరణి చట్టంతో కేసీఆర్ ఓటమి…ఏపీలో భూ హక్కు చట్టంతో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని హెచ్చరించారు. జగన్ ఫోటో పెట్టడానికి మినహా రైతుల పాస్ బుక్ ఎందుకు పనికి రాకుండా చేశాడని మండిపడ్డారు సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ.

cpi narayana

మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నుంచి ఏపీ రాజకీయాలను చూస్తున్నా, జగన్మోహన్ రెడ్డి లాంటి కర్కోటక సిఎంను చూడలేదని ఆగ్రహించారు. పరిపాలన చేతకాని సిఎం జగన్మోహన్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు. గంగమ్మ జాతరలో బూతు పురాణాలలో గంగమ్మను సాగనంపినట్లు మంత్రి రోజాను ప్రజలు ఓడించి సాగనంపుతారని ఎద్దేవా చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ. వైసీపి వారు డబ్బులు పంచుతున్నట్లు మా నాయకులు కరపత్రాలు కూడా పంచలేకపోతున్నారన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news