పల్నాడు జిల్లాలో దారుణం..ఓ మహిళతో అక్రమ సంబంధం..ప్రెగ్నెంట్‌ కావడంతో !

-

పల్నాడు జిల్లా ముప్పాళ్ళలో దారుణం చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్న మహిళతో పాటు, ఆమె కొడుకును హత్య చేసేందుకు ప్రయత్నించాడు ముద్దా శ్రీను అనే వ్యక్తి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ మహిళతో గడిచిన మూడు సంవత్సరాలుగా హైదరాబాదులో సహజీవనం చేస్తున్నారు ఈపూరు మండలం ముప్పాళ్ళకు చెందిన ముద్ద శ్రీను. ముద్ద శ్రీను వల్ల గర్భం రావడంతో తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చింది ఆ బాధిత మహిళ. దీంతో మహిళతో పాటు ఆమె కొడుకును అడ్డు తొలగించుకునేందుకు ముద్దా శ్రీను ప్లాన్‌ వేశాడు.

హైదరాబాద్ నుంచి సొంత గ్రామం ముప్పాళ్ళ తీసుకువచ్చి , గొంతు నులిమి చంపేందుకు, యత్నించాడని ముద్ద శ్రీను పై పోలీసులు కేసు నమోదు అయింది. అంతకు ముందే ఆ మహిళను ,ఆమె బిడ్డను చంపి పాతి పెట్టేందుకు, ముందుగానే గోతులు తవ్వి ఉంచాడు ముద్ద శ్రీను.. మహిళను హత్య చేసే క్రమంలో, కేకలు వేయడం జరిగింది. దీంతో సమీపంలో ఉన్న హైడల్ ప్రాజెక్ట్ ఉద్యోగులు వ్యవహారాన్ని పసిగట్టడంతో మహిళకు , ఆమె బిడ్డకు ముప్పు తప్పింది. హైడల్ ప్రాజెక్ట్ ఉద్యోగులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రావడంతో పరారయ్యాడు నిందితుడు ముద్ద శ్రీను. అటు బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు, హత్యాయత్నం కింద కేసు నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news