పేర్ని నాని చెప్పులు, డ్రాయర్లు పవన్‌ కళ్యాణ్‌ దోచేశాడు – మంత్రి దాడిశెట్టి

-

పేర్ని నాని చెప్పులు, డ్రాయర్లు పవన్‌ కళ్యాణ్‌ దోచేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి దాడిశెట్టి రాజా. ఇవాళ మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ… పేర్ని నాని ఇంట్లో ఎవరో చెప్పులు డ్రాయర్లు దోచేశారట. అ వ్యక్తి కాకినాడ జిల్లాలో లారీ ఎక్కి తిరుగుతున్నాడని… ఎద్దేవా చేశారు. నలభై ఐదు గుళ్ళు విజయవాడ లో కూలగొడితే నువ్వు నోట్లో ఏం పెట్టుకున్నావు.. పవన్ మాటలకు పొంతన ఉండదని మండిపడ్డారు.

కులాలు, మతాల కోసం మాట్లాడతాడు… పవన్ కళ్యాణ్ బాబా అవతారం ఎత్తి అమరావతి కోసం మాట్లాడతాడని ఆగ్రహించారు. పవన్ కళ్యాణ్ ను సైక్రియాటిస్ట్ దగ్గరకు తీసుకువెళ్తే బాగుంటుందని.. గంట గంటకు కలలు గని రకరకాలుగా మాట్లాడతాడని నిప్పులు చెరిగారు. పవన్ మాటలకు క్లారిటీ ఉందా? వారాహి యాత్ర రెండు సభలు ఫెయిల్ అన్నారు. సభలకు జనం రాకపోతే నీ యాజమాని ప్యాకేజ్ ఇవ్వడని… సిఎం అయిపోవాలని నువ్వు డిసైడ్ అయిపోతే ప్రజలు ఒప్పుకోవాలి కదా అంటూ చురకలు అంటించారు మంత్రి దాడిశెట్టి రాజా.

Read more RELATED
Recommended to you

Latest news