BREAKING : వారాహి యాత్రలో పెను విషాదం..ఓ మహిళ మృతి ?

-

BREAKING : వారాహి యాత్రలో పెను విషాదం చోటు చేసుకుంది. పెడన వారాహీ యాత్రలో ఓ మహిళకు అస్వస్థత నెలకొంది. వరుదు రమాదేవి అనే మహిళకు గుండె పోటు వచ్చింది. దీంతో వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అయితే… అప్పటికే వరుదు రమాదేవి మరణించారు. ఇక వరుదు రమాదేవి మృతిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వరుదు రమాదేవి హఠాన్మరణం దురదృష్టకరం ఆవేదన వ్యక్తం చేశారు.

జనసేన పార్టీ నాయకురాలు వరుదు రమాదేవి హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది…వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు పవన్‌ కళ్యాణ్‌. పార్టీకి తొలి నుంచి అండగా నిలుస్తూ, ప్రతి కార్యక్రమంలో ఎంతో చురుగ్గా పాల్గొనేవారు….పార్టీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేశారని కొనియాడారు.పెడన సభ నిర్వహణ సన్నాహక సమావేశాల్లో పాలుపంచుకున్నారు….రమాదేవి మరణం బాధాకరం.. వారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు పవన్‌ కళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Latest news