బై బై చంద్రబాబు, బైబై పప్పు, బైబై పవన్ అని ఎప్పుడో చెప్పేసారు – దేవినేని అవినాష్

-

బై బై చంద్రబాబు, బైబై టిడిపి, బైబై జనసేన అని ఎప్పుడో చెప్పేసారని చురకలు అంటించారు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్. యువగళ లోకేష్, వా(నా)రాహి యాత్రగా పవన్, చంద్రబాబు లక్ష్యం సీఎం జగన్ ను దించేయడమని… ఏ సినిమాలో అయినా ఒక్కడే హీరో.. ఈ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి హీరో సీఎం జగన్ అన్నారు. విలన్లు అందరూ గుంపులుగా వచ్చినా… సింహంలా సింగిల్ గా వచ్చే హీరో సీఎం జగన్… అని తెలిపారు.

బై బై చంద్రబాబు, బైబై టిడిపి, బైబై జనసేన అని ఎప్పుడో చెప్పేసారు..బైబై బాబు, బైబై పప్పు అని ఎప్పుడో మహిళలు చెప్పేసారని ఎద్దేవా చేశారు. మీరు అరిచినా, నడిచినా, ఏం చేసినా ప్రజలు సీఎం జగన్ వెనుకే అని ప్రతిపక్షాలు తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ నేతృత్వంలో తూర్పు నియోజకవర్గంలో 500 కోట్లు అభివృద్ధి పనులు చేసామని… మా ప్రాంతానికి నువ్వేం చేసావని గద్దె రామ్మోహన్ ని ప్రజలు అడిగితే వాళ్ళ కు సమాధానం లేదని మండిపడ్డారు. సీఎం జగన్ చేతుల మీదుగా జగనన్న సురక్ష పధకం ప్రారంభించారని.. చాలామంది నలభైఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకున్నారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news