ఏపీలో ఒక ఎకరం అమ్మితే…తెలంగాణ 150 ఎకరాలు వస్తాయి – మంత్రి అమర్నాథ్

-

ఏపీలో ఒక ఎకరం అమ్మితే…తెలంగాణ 150 ఎకరాలు వస్తాయని KCR కామెంట్స్ పై ఏపీ మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. గడప గడపకు వెళ్లకపోతే ఎమ్మెలే సీట్లు ఉండవని సీఎం వైఎస్ జగన్ చెప్పారు..అంత దైర్యం గా చెప్పిన నేత మరొకరు లేరన్నారు.

ఏపిలో భూముల విలువలు తగ్గాయని చంద్రబాబు కేసీఆర్ కు చెప్పరంటా.. ఒకసారి అచ్యుతాపురం కేసీఆర్ వస్తే ఎకరా రేటు ఎంత ఉందో తెలుస్తుందంటూ ఎద్దేవా చేశారు. అచ్యుతాపురంలో ఎకరా అమ్మితే తెలంగాణలో 150 ఎకరాల కొనవచ్చన్నారు. టిడిపి నేతల భవిష్యత్తుకే గ్యారెంటీ లేదని… టిడిపి నేతలు ప్రజల భవిష్యత్తుకు ఏమి గ్యారెంటీ ఇస్తారని ఫైర్‌ అయ్యారు. కేజీ బంగారం బెంజ్ కారు అంటూ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తారని… సీఎం విజయాన్ని అడ్డుకునే సత్తా చంద్రబాబు ఆయన చెంచా పవన్ కల్యాణ్ కు లేదని విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news