లోకేష్ ది పాదయాత్ర కాదు.. ఫ్లాప్ యాత్ర : దేవినేని అవినాష్

-

లోకేష్ ది పాదయాత్ర కాదు.. ఫ్లాప్ యాత్ర  అని సంచలన వ్యాఖ్యలు చేశారు విజయవాడ ఈస్ట్ వైసీపీ ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయ్యిందని వ్యాఖ్యానించారు. తాను ఏ పార్టీలో ఉన్నప్పుడు బలి పశువును అయ్యానో అందరికీ తెలుసునని అవినాష్ పేర్కొన్నారు. టీడీపీ నేతల పిచ్చివాగుడును ప్రజలు నమ్మరని.. పనికిరాని వారు తమపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. 

తనకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారని పేర్కొన్నారు. విజయవాడ ప్రజలకు, దుర్గమ్మకు క్షమాపణలు చెప్పిన తర్వాతే నారా లోకేష్ నగరంలో అడుగుపెట్టాలని హెచ్చరించారు. దుర్గగుడిలో క్షుద్రపూజలు చేయించారని.. టీడీపీ హయాంలో రిటైనింగ్ వాల్ ఎందుకు కట్టలేదో సమాధానం చెప్పాలని అవినాష్ డిమాండ్ చేశారు. లోకేష్ పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ కావడంతో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని.. ఖర్చు భరించలేక, జనాన్ని సమీకరించలేక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారని దేవినేని అవినాష్ చురకలంటించారు. 

Read more RELATED
Recommended to you

Latest news