RGV పై దేవినేని ఉమా తిట్ల పురాణం

-

ఎన్టీఆర్ జిల్లా: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై రెచ్చిపోయారు టిడిపి నేత దేవినేని ఉమా. వర్మపై దేవినేని తిట్ల పురాణం అందుకున్నారు. రాంగోపాల్ వర్మ ఓ దగుల్బాజీ, దుర్మార్గుడు, దౌర్భాగ్యుడంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి వాళ్లు ఉండబట్టే రాష్ట్ర నాశనం అవుతుందన్నారు. సినిమా ద్వారా ప్రజలకు వాస్తవం చెప్పరా దరిద్రుడా..! అంటూ మండిపడ్డారు.

అన్నం తింటున్నావా.. గడ్డి తింటున్నావా..? వర్మ అని ప్రశ్నించారు. చంద్రబాబు కష్టం, పట్టిసీమ గొప్పతనం సినిమా తీయాలన్నారు. దమ్ముంటే ఈ విషయాలు జగన్ కు చెప్పమని సూచించారు దేవినేని ఉమా. పట్టిసీమ లాంటి పవిత్ర స్థలంలో సినిమాలు తీస్తున్నాడని.. వర్మ నీకు బుద్ది, జ్ఞానం ఉందా..? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవటానికి సీఎం జగన్ ఆర్జీవీతో సినిమాలు తీయిస్తున్నాడని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version