చంద్రబాబు కీలక నిర్ణయం…రెండు రకాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ !

-

డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ తుది కసరత్తు చేస్తున్నారు. రెండు రకాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనుందట చంద్రబాబు ప్రభుత్వం. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల రెండు రకాలుగా నోటిఫికేషన్ ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. టెట్ పరీక్షల్లో అర్హత పొందిన వారికి నేరుగా మెగా డీఎస్సీకి వేరే నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నదని సమాచారం.

ఈ మేరకు ఈ నెల 30వ తేదీన నోటిఫికేషన్ల విడుదల కానుందట. డిసెంబర్ 10వ తేదీ నాటికి అప్పాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేలా మెగా డీఎస్సీ షెడ్యూల్ చేశారు. ఆయా జిల్లాల్లోని స్థానికులతోనే 80 శాతం టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా 16347 పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం.

పాఠశాల విద్యా శాఖ పరిధిలో భర్తీ కానున్న 13661 టీచర్ పోస్టులు…. ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో భర్తీ కానున్న 439 టీచర్ పోస్టులు ఉన్నాయి. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో భర్తీ కానున్న 170 టీచర్ పోస్టులు….ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో భర్తీ కానున్న 2024 టీచర్ పోస్టులు ఉన్నాయి. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో భర్తీ కానున్న 49 టీచర్ పోస్టులు….బాల నేరస్తులకు విద్యా బోధన కోసం 15 టీచర్ పోస్టుల భర్తీ చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news