తిరుమల భక్తులకు శుభవార్త..ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లు విడుదల

-

తిరుమల భక్తులకు శుభవార్త..ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. నవంబర్ నెలకు సంబంధించి ఇవాళ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవ, సహస్త్ర దీపాలంకరణ సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదలవుతాయి.

రేపు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవారి దర్శన టికెట్లు, రేపు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. టిటిడి వెబ్ సైట్ www.tirupatibalaji.ap.gov.in ద్వారా భక్తులు టిక్కేట్లు బుక్ చేసుకోవాలని కోరింది టిటిడి పాలకమండలి.  ఇది ఇలా ఉండగా, 69,909 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన 29,327 మంది భక్తులు కాగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.37 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news