తిరుమలలో అగ్ని ప్రమాదం జరిగింది. శిలా తోరణం నుంచి శ్రీవారి పాదాల దగ్గర మంటలు విపరీతంగా చెలరేగాయి. వెంటనే ఫైర్ సిబ్బందికి ఆలయ అధికారులు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. సంఘటనపై మరిన్ని వివరాలు విలువడాల్సి ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతిలో అనేక రకాల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో తిరుమలలోని భక్తులు సీరియస్ అవుతున్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తిరుమలలో ఎలాంటి సమస్యలు రాలేవని ఇప్పుడు అనేక రకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడుతున్నారని అనేక రకాల వార్తలు వచ్చాయి.
మరోవైపు తిరుమల కొండపై మాంసాహారం తీసుకెళ్లారు. తిరుమల కొండపైన మద్యం బాటిళ్లు కూడా కనిపించాయి. పోలీసులు కూడా కొట్టుకోవడం ఇలాంటివి అనేక రకాల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా అగ్ని ప్రమాద ఘటన జరిగింది. కాగా తిరుమలలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ఆలయ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
తిరుమల శ్రీవారి పాదాల సమీపంలోని అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం
సమాచారం అందుకొని ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది
దాదాపు వంద మీటర్ల మేర అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించాయని తెలిపిన అధికారులు pic.twitter.com/IaV98hwuTR
— Telugu Scribe (@TeluguScribe) June 10, 2025