ఏపీలో చేపల వేటకు విరామం..61 రోజుల పాటు!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మత్స్యకారులకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి ఏపీలో చేపల వేటకు విరామం ఇవ్వనున్నారు అధికారులు. ఈ రోజు నుంచి దాదాపు 61 రోజులపాటు చేపల వేట బంద్ కానుంది. ఒకవేళ ఈ రూల్స్ బ్రేక్ చేసి ఎవరైనా… చేపలు పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఈ రూల్స్ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.

Fishing will be banned for approximately 61 days from today

చేపల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు… తల్లి రొయ్యలను సంరక్షించడం… వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం… మత్స్య సంపద పెంచేందుకు గాను… 61 రోజులపాటు వేట కు వెళ్లకూడదని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ 61 రోజుల పాటు వేట నిషేధిస్తే మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారు. ఇలాంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వాళ్లకు జీవన భృతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు కూడా ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news