ఒకే ఇంట్లో అయిదుగురు కిడ్నాప్…?

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో కిడ్నాప్ కేసులు, మిస్సింగ్ కేసులు ఎక్కువగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. పోలీసులకు కూడా ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. నెల్లూరు జిల్లాలో ఒకే ఇంట్లో 5 మంది అదృశ్యం అయిన ఘటన సంచలనం అయింది. ఇద్దరు తొడికోడళ్లు, ముగ్గురు పిల్లలు అదృశ్యం అయ్యారు. వెంకటగిరి మం జికె పల్లి గ్రామములో నిన్న మధ్యాహ్నం నుండి అదృశ్యం అయ్యారు.

పిల్లల ముగ్గురిని ఆసుపత్రికి తీసుకెళ్తు అదృశ్యం అయ్యారు అని తెలుస్తుంది. నిన్న మధ్యాహ్నం 1 గంట తర్వాత నుంచి వారి ఆచూకీ దొరకలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. గ్రామస్తులు కూడా వారి కోసం ఎక్కువగా గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news