BREAKING : నెల్లూరులో వైసీపీ, జనసేన నేతల మధ్య ఫ్లెక్సీ వార్..

-

నెల్లూరులో వైసీపీ, జనసేన నేతల మధ్య ఫ్లెక్సీ వార్ చోటు చేసుకుంది. పేదలకు..పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధం అనే పేరుతో చంద్రబాబు ను పల్లకి లో పవన్ కళ్యాణ్ మోస్తున్నట్లు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు వైసీపీ ఎంపీ ఆదాల అనుచరులు.

అయితే.. దీనికి పోటీగా పాపం పసివాడు పేరిట సీఎం జగన్ డబ్బు మూటలు మోసుకుపోయే చిత్రాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాయి జన సేన శ్రేణులు. అయితే.. జనసేన శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటున్నారు నెల్లూరు పోలీసులు. దీంతో వైసీపీకి ఓ న్యాయం, తమకో న్యాయమా అంటూ పోలీసులను ప్రశ్నిస్తున్నారు జనసేన శ్రేణులు. దీంతో నెల్లూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version