జూలై నుంచి విశాఖ నుంచి కొలంబోకు విమాన సర్వీసులు ప్రారంభం

-

విశాఖ నుంచి కొలంబో కు జూలై నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నట్లు ఏపీ మంత్రి అమర్నాథ్ ప్రకటించారు. విశాఖ కనెక్ట్ అండ్ టూరిజం మెగామీట్ ప్రారంభించారు మంత్రి అమర్నాథ్. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. ఈ నెల 22 నుంచి 26 వరకు దావొస్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు ద్వారా ఏపీకి పెట్టుబడులు వస్తాయన్న విశ్వాసం ఉందని వెల్లడించారు.

దావొస్ లో 18 అంశాలు పై సదస్సు జరుగుతోంది. వీటిలో 10 అంశాలు ప్రాధాన్యత గా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోందని వెల్లడించారు. వ్యవసాయం..పర్యాటకం ..విద్య..వైద్యం..ఆర్థిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రాష్ట్రానికి షో కేస్ చేసే అవకాసం దావోస్ సదస్సు ద్వారా లభిస్తోందని స్పష్టం చేశారు. బీచ్ ఐటి అనే నినాదంతో ఐటి రంగాన్ని అభివృద్ధి చేస్తామని.. కరోనా సమయంలో మలేషియా .బ్యాంక్ కాక్.,.సింగపూర్ లకు ఆగిన విమాన సర్వీసులు పునరుద్ధరణ జరుగుతోందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news