KAKANI: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించారు. వెంకటాచలం ఎమ్మార్వో కార్యాలయంలో ప్రభుత్వ భూ రికార్డులు తారుమారు చేశారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు అయింది.

పీటీ వారెంట్ పై కాకాణిని రెండోవ అదనపు మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఎదుట వర్చువల్ గా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిను పోలీసులు హాజరు పరిచారు. ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి..హాజరు పరిచిన ఆగస్టు 7 వరకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ విధించారు. ఇప్పటికే వివిధ కేసుల్లో నెల్లూరు సెంటర్ జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.