రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త

-

ఏపీ రేషన్ కార్డుదారులకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. వచ్చే నెల నుంచి బల వర్ధక ఫోర్టిఫైడ్ బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాగేశ్వరరావు ప్రకటన చేశారు.

పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మొదట శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖ జిల్లాలలోని మున్సిపాలిటీలలో రెండు కిలోల గోధుమపిండిని అందిస్తామని మంత్రి నాగేశ్వరరావు తెలిపారు. ఆ తర్వాత త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ పంపిణీ కొనసాగుతుందని ఆయన వివరించారు. వచ్చే రెండు నెలల్లో జొన్నలు మరియు రాగులు రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తామని ప్రకటించారు ఏపీ మంత్రి నాగేశ్వరరావు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపిందని ఆయన గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news