ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. మంత్రి కీలక ప్రకటన!

-

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి తెలిపారు.అందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్నామని చెప్పారు. ఆదివారం రాయచోటి మండల పరిధిలోని శిబ్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన ‘ఇది మంచి ప్రభుత్వం’కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడుతూ.. దీపావళి నుంచి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. డ్వాక్రా సంఘాల బలోపేతానికి వారికి రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలు ఇస్తామని తెలిపారు.

అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు 3 పూటలా ఆహారం అందిస్తున్నామని చెప్పారు.అర్హులందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్‌ భరోసా కింద సామాజిక పెన్షన్లు ఇస్తున్నామన్నారు. నూతన జిల్లాల్లో ప్రతి శాఖకు ప్రభుత్వ భవనాలను నిర్మిస్తున్నామన్నారు.ప్రస్తుతం నూతన జిల్లాల్లో ప్రభుత్వ భవనాలు లేక ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, కొత్త జిల్లాల్లో అన్ని శాఖలకు ప్రభుత్వ భవనాలు నిర్మిస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news