ఎల్లుండే జగనన్న చేదోడు పథకం నిధులు విడుదల.. రూ.10 వేల ఆర్థిక సాయం

-

ఎల్లుండే జగనన్న చేదోడు పథకం నిధులు విడుదల కానున్నాయి. జగనన్న చేదోడు పథకం కింద నాలుగో విడత లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 19న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బటన్ నొక్కి డబ్బుల్ని విడుదల చేయనున్నారు. దీంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

హెలిప్యాడ్ ఏర్పాటు కోసం పట్టణంలోని వెంకటాపురం కాలనీ వద్ద స్పిన్నింగ్ మిల్లు సమీపంలోని మైదానాన్ని పరిశీలించారు. అనంతరం పట్టణంలోని వైడబ్ల్యూసిఎస్ మైదానంలో ఏర్పాటు చేయనున్న సీఎం సభా స్థలిని పరిశీలించారు. బారికేడ్ల ఏర్పాటు, విఐపి గ్యాలరీ, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు జేసి సూచనలు ఇచ్చారు. జగనన్న తోడు పథకం లబ్ధిదారులను తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వినతులు తీసుకునేందుకు గ్యాలరీ ఏర్పాటు చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news