తిరుపతికి రింగ్ రోడ్డు ఏర్పాటు..కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన !

-

తిరుపతికి రింగ్ రోడ్డు ఏర్పాటుపై..కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్ ను సందర్శించారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. ఈ సందర్భంగా హాస్పిటల్ వద్ద స్వాగతం పలికారు టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మా రెడ్డి. అనంతరం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. టిటిడి గుండె, లంగ్స్ మార్పిడి విధానం ద్వారా పేదలకు సేవలు అందిస్తోంది ప్రశంసించారు.

1600 గుండె ఆపరేషన్ లు చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. పేదలకు టిటిడి హాస్పిటల్ ద్వారా మంచి సేవ చేస్తోందని వివరించారు. గుండె,లివర్ మార్పిడి విధానం ఇక్కడ చేస్తున్నారని.. ఇంటర్నేషనల్ హాస్పిటల్ స్థాయిలో సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేసి పేదలకు టిటిడి సేవ అందిస్తోందని తెలిపారు. తిరుపతికి రింగ్ రోడ్ ఏర్పాటు అంశంపై పరిశీలించి, నిర్ణయం తీసుకుంటామని.. తిరుపతి జిల్లాలో వేల కోట్ల తో జాతీయ రహదారులు నిర్మాణం పనులు జరుగుతున్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news