జనసేనకు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

-

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల  ప్రచారం చాలా రసవత్తరంగా కొనసాగుతుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష కూటమి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలోనే   గుర్తులపై జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే గాజు గ్లాస్ గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించనున్నట్టు వార్తలు రావడంతో జనసేన కాస్త నిరాశలో ఉండింది. తాజాగా ఈసీ గాజు గ్లాస్ గుర్తును జనసేనకు కేటాయించనున్నట్టు ప్రకటించింది.

ముఖ్యంగా ఫ్రీ సింబల్ గా ఉన్న గాజు గ్లాసును జనసేనకు కేటాయించాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు సీఈవో మీనా ముఖేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో జనసేన సింబల్ గా గాజు గ్లాసు కేటాయించాలని సూచించారు. గతంలో గాజు గుర్తు ఫ్రీ సింబల్గా ఉండటంతో తమకు కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని జనసేన కోరింది. అయితే గాజు గ్లాసు గుర్తును తమకే కేటాయించాలని రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దీంతో జనసేనికుల్లో ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న నిర్ణయం జనసైనికులకు ఊరట కల్పించింది.

Read more RELATED
Recommended to you

Latest news