శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్..!

-

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇరుముడితో శబరిమలై వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం పౌర విమానయాన శాఖ ద్వారా నిబంధనలు సడలింపు చేసినట్లు పేర్కొన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.

Good news for the devotees of Ayyappa Swamy going to Sabarimala

సెక్యూరిటీ స్కానింగ్ తర్వాత పవిత్రమైన ఇరుముడితో నేరుగా విమాన క్యాబిన్ లోనే ప్రయాణం చేయవచ్చని తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్‌ చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.

ఇరుముడితో శబరిమలై వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం పౌర విమానయాన శాఖ ద్వారా నిబంధనలు సడలించడం జరిగిందని….పోస్ట్‌ పెట్టారు. సెక్యూరిటీ స్కానింగ్ అనంతరం భక్తులు పవిత్రమైన ఇరుముడితో నేరుగా విమాన క్యాబిన్ లోనే ప్రయాణించవచ్చు అన్నారు. మండలం నుంచి మకర జ్యోతి దర్శనం(జనవరి 20) వరకు కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవడంతో పాటు భద్రతా సిబ్బందికి సహకరించాల్సిందిగా కోరుతున్నా అంటూ వీడియో రిలీజ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version