గ్రామ సచివాలయంలోని ఎనర్జీ అసిస్టెంట్లకు గుడ్‌ న్యూస్‌ !

-

గ్రామ/వార్డు సచివాలయాల్లో ఎనర్జీ అసిస్టెంట్లకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. జేఎల్ఎం గ్రేడ్-2 ఉద్యోగాలు పొందిన వారిలో అర్హత గల వారిని పర్మినెంట్ చేస్తూ ఏపీ తూర్పు, మధ్య దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు ఉత్తర్వులు జారీ చేశాయి.

మూడు విద్యుత్ సంస్థల్లో కలిపి మొత్తం 7,883 మందిని 2019లో నియమించగా… ఇప్పుడు వారిని పర్మినెంట్ చేసింది. ఇక అటు యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3295 అధ్యాపక పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా… ఈనెల 23న APPSC నోటిఫికేషన్ ఇవ్వనుంది. సెప్టెంబర్ 3, 4 వారాల్లో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించి… అక్టోబర్ 10 నాటికి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదలైన నెల రోజుల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి… నవంబర్ 15 నాటికి ప్రక్రియ పూర్తి చేయనున్నారు. అదేరోజు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news