బ్రేకింగ్ : విజయసాయిరెడ్డిపై అనర్హత వేటు పిటిషన్ కొట్టివేసిన రాష్ట్రపతి

-

ఏపీకి చెందిన రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి మీద అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ ను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కొట్టివేశారు. కేబినెట్ ర్యాంక్ స్థాయిలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా లాభాదాయక పదవిలో ఉన్నారని బీజేపీ నేత సిహెచ్ రామ కోటయ్య ఫిర్యాదు చేశారు. దీంతో లాభదాయక పదవుల కేసులో విజయసాయిరెడ్డికి ఊరట లభించింది. రాజ్యసభ ఎంపీగా ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పదవి కలిగి ఉండడంపై బీజేపీ నేత రామకోటయ్య ఫిర్యాదు చేశారు.

లాభదాయక పదవులు కలిగి ఉన్నందున రాజ్యసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్ వేసారు. పిటిషన్‌పై ఎన్నికల కమిషన్ అభిప్రాయం తీసుకున్నారు రాష్ట్రపతి. అయతే ప్రత్యేక ప్రతినిధిగా ఎలాంటి జీతభత్యాలు తీసుకోనందున ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద పరిగణించలేమని ఎన్నికల కమిషన్ వెల్లదించింది. ప్రిపెన్షన్ ఆఫ్ డిస్‌క్వాలిఫికేషన్ యాక్ట్ వర్తించదని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈసీ అభిప్రాయం మేరకు అనర్హత పిటిషన్‌ను కొట్టేస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news