గుడ్ న్యూస్ : సినిమా టికెట్ల ధ‌ర‌లు పెంచుతూ జీవో జారీ

-

టాలీవుడ్ కు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుతూ ఈ రోజు కేబినేట్ లో రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విషయం తెలిసిందే. కాగ తాజా గా సినిమా టికెట్ల ధ‌ర ల‌ను పెంచుతూ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం జీవోను విడుద‌ల చేసింది. గ‌రిష్ట సినిమా టికెట్ ధ‌ర రూ. 250 గా ప్ర‌భుత్వం కేటాయించింది. అలాగే క‌నిష్టం గా ఒక సినిమా టికెట్ ధ‌ర ను రూ. 20 కు కేటాయించింది.

అలాగే రాష్ట్రంలో 5 షో ల‌కు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. అయితే ఈ 5 షో ల‌లో ఉద‌యం 11 గంట‌ల‌కు, రాత్రి 9 గంట‌లకు చిన్న సినిమాలు వేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం కండీషన్ పెట్టింది. కా మున్సిపాలిటీల్లో నాన్ ఏసీ థీయేట‌ర్స్ లో టికెట్ ధ‌ర‌లు రూ. 30, రూ. 40 గా, ఏసీ థీయేట‌ర్స్ లో రూ. 60, రూ. 80 గా, మ‌ల్టీ ప్లెక్స్ ల‌లో రూ. 125 గా కేటాయించింది. అలాగే కార్పోరేషన్ ల‌లో నాన్ ఏసీ థీయేట‌ర్స్ ల‌లో టికెట్ ధ‌ర రూ. 40, రూ. 80 గా, ఏసీ థీయేట‌ర్స్ ల‌లో రూ. 70, రూ. 100 గా, మ‌ల్టీప్లెక్స్ లో రూ. 150, రిక్లైన‌ర్ రూ. 250 గా కేటాయించింది.

అలాగే న‌గ‌ర పంచాయ‌తీ, గ్రామ పంచాయ‌తీల్లో టికెట్ ధ‌ర.. నాన్ ఏసీ థీయేట‌ర్స్ ల‌లో టికెట్ ధ‌ర‌ రూ. 20 , రూ. 40 గా, ఏసీ థీయేట‌ర్స్ ల‌లో రూ. 50, రూ. 70 గా, మ‌ల్టీ ప్లెక్స్ ల‌లో రూ. 100 గా కేటాయించింది.

Read more RELATED
Recommended to you

Latest news