ఏపీ గవర్నర్ జాతరలో విగ్రహం : గోరంట్ల బుచ్చయ్య చౌదరి

-

ఏపీ గవర్నర్ జాతరలో విగ్రహం అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. గవర్నర్ ఉత్సవ విగ్రహంలా ఉండటం మంచిది కాదని.. వచ్చిన ప్రతి ఫైల్ పై గవర్నర్ గుడ్డిగా సంతకం పెట్టడం సరికాదని అగ్రహించారు. కాగ్ నివేదికలు గవర్నర్ కి వచ్చినప్పుడు ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశించలేదు..? అని నిలదీశారు. శ్రీలంక పరిస్థితులు నేడు ఏపీలోను కనిపిస్తున్నాయని ఫైర్ అయ్యారు.

రూ. 7.76 లక్షల కోట్ల మేర ఏపీ ప్రభుత్వం అప్పు చేసిందని.. సీఎం జగన్ తప్పుడు నిర్ణయాల వల్ల ఏపీ దివాళా తీసిందని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ పెద్దలకు ఆర్ధిక క్రమశిక్షణ లేదని.. సంక్షేమం ముసుగులో పేదవాడికి తాగుబోతులుగా మారుస్తున్నారని నిప్పులు చెరిగారు. ఏపీలో నెలకొన్న పరిస్థితులను కేంద్రం పట్టించుకోవడం లేదని.. ఏపీలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై కేంద్రం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రం వెంటనే ఏపీలో నెలకొన్న పరిస్థితులపై నివేదికలు తెప్పించుకోవాలని హెచ్చరించారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version