మూడు రాజదానులకు గవర్నర్ ఓకే….?

-

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజదానులకు సంబంధించి ఇప్పుడు గవర్నర్ తీసుకునే నిర్ణయం పైనే సర్వత్రా ఆసక్తి ఉంది. మూడు రాజధానుల బిల్లుని గవర్నర్ దాదాపుగా ఆమోదించినట్టే అంటూ రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మూడు రాజధానుల బిల్లుకి సంబంధించి వివరణ ఇవ్వడానికి గానూ జగన్ సర్కార్ ఒక సీనియర్ మంత్రిని గవర్నర్ వద్దకు పంపించింది అని సమాచారం.

ఆయన మూడు రాజధానుల గురించి గవర్నర్ కి వివరించే సమయంలో ఆయన సానుకూలంగా స్పందించారు అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఆయన దాదాపుగా ఓకే చెప్పారు అనే ప్రచారం జరుగుతుంది. అదే విధంగా రాబోయే రెండు మూడు రోజుల్లో కచితంగా బిల్లు ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. నిజమా కాదా అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి.

Read more RELATED
Recommended to you

Latest news