పవన్ కళ్యాణ్‌ బిగ్‌ ట్రీట్‌…జనసేన ప్రజా ప్రతినిధులకు సత్కారం

-

పవన్ కళ్యాణ్‌ బిగ్‌ ట్రీట్‌ ఇచ్చారు. జనసేన ప్రజా ప్రతినిధులను సత్కారించారు. జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజా ప్రతినిధుల సత్కార కార్యక్రమంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మొత్తం పవన్ సహా 24 మంది ప్రజా ప్రతినిధులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు.

Greetings to Janasena public representatives

పార్టీని అంచెలంచెలుగా పెరిగేలా చేయడంలో పవన్ చాలా ఓపికతో.. వ్యూహంతో వ్యవహరించారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నాం.. మిత్రపక్షాలతో సమన్వయంతో వెళ్లాలని వెల్లడించారు.క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బంది.. మచ్చ రాకుండా అందరూ పని చేయాలని కోరారు. పదవులు మనకొచ్చాయి.. కానీ మనం కోసం పని చేసిన జనసైనికులు, వీర మహిళలను మరువద్దని కోరారు.

క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి….పార్టీ మీద, ప్రభుత్వం మీద దుష్ప్రచారం మొదలు పెడతారు.. తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.కూటమి ప్రభుత్వం అమలు చేసే పథకాలు.. అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలి… నిజాయితీగా పని చేయాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం సంక్షేమం పేరుతో దోపిడీ చేసిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version